ఢిల్లీ ,మే 14: ఇండియా బుల్స్ గ్రూప్ కు చెందిన ధనీ డిజిటల్ యాప్ కరోనాకష్టకాలంలో బాధితులను ఆదుకునేందుకు ముందుకువచ్చింది. రూ. 90 కోట్ల విలువైన 25 లక్షల ఉచిత కోవిడ్ సంరక్షణ ఆరోగ్య కిట్స్ని పంపిణీ చేయడం ప్రారంభించింది ధనీ యాప్. దీనివల్ల 50 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనున్నది. ప్రతి కోవిడ్ సంరక్షణ ఆరోగ్య కిట్లో ఇద్దరువ్యక్తులకు కావలసిన రోగ నిరోధక మందులు ఉంటాయి.
ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సిఫారసు చేసిన ప్రకారం ఈ కిట్ని ప్యాక్ చేశారు. కోవిడ్ 19లో ప్రారంభ వ్యాధినిరోదక సంరక్షణగా సహాయపడుతుంది. ఈ కిట్లో ఒక నెలకు సరిపడా మందులు ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ డి3, జింకు ద్వారా మనిషిలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. జ్వరం లేదా ఒళ్ళు నొప్పులు ఉంటే వేసుకునేందుకు పారాసెటమాల్ కూడా ఉంది.
ఈ కార్యక్రమం నుంచి ప్రయోజనం పొందాలనుకునే వారు ధనీ యాప్కి లేదా https://pharmacy.dhani.com/ కు లాగిన్ అయి ఉచితంగా ఆర్డరు పెట్టుకోవచ్చు. అంతేకాకుండా డాక్టర్లు ,స్పెషలిస్టులతో 24గంటల ఉచిత వీడియో కాల్స్ కూడాఅందిస్తోంది ధనీ. “రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికీ ఈ కిట్ సహాయపడుతుంది , ఏ వ్యక్తికైనా జ్వరం, దగ్గు లేదా గొంతు ఇన్ఫెక్షన్ లాంటి లక్షణాలు ఏవైనా కలిగితే కోవిడ్ రాకుండా సంక్షణగా ఈ మందులు ఉపయోగించవచ్చు. ఏదైనా సహాయం కోసం ఉచిత వీడియో కన్సల్టేషన్ల కోసం ధనీ డాక్టరుతో కూడా ప్రజలు కనెక్ట్ అవ్వవచ్చు.” అని ధనీ హెల్త్కేర్ ప్రెసిడెంట్ నిఖిల్ చారీ తెలిపారు.