చార్మినార్, మే 13: మూషిక జింకల జీవిత విశేషాలను ప్రతి ఒక్కరికి చేరేలా పోస్టర్ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని నెహ్రూ జులాజికల్ పార్క్ డిప్యూటీ క్యూరేటర్ ఎ.నాగమణి తెలిపారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా 75 జూ పార్క్లలో నిర్వహిస్తున్న ‘ఆజాది కా అమృతోత్సవ్’ కార్యక్రమంలో నెహ్రూ జూ పార్క్లో మూషిక జింకలపై వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని డిప్యూటీ క్యూరేటర్ నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా జూలోని పలు ప్రాంతాల్లో క్యూరేటర్ సుభద్రాదేవి పలు రకాల మొక్కలను నాటి సంరక్షణ చర్యలు తీసుకున్నారు.