ఢిల్లీ , మే11: కరోనా రోగుల చికిత్స కోసం రూ.2 లక్షలపైగా నగదు చెల్లింపులను స్వీకరించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఇందులో ఎర్రర్ను సవరిస్తూ కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 31వ తేదీ వరకు కరోనా రోగులు లేదా వారి బంధువులు రూ.2 లక్షలకు పైన నగదు చెల్లింపులు చేసినా, హాస్పిటల్స్, డిస్పెన్సరీలు, కొవిడ్ కేర్ కేంద్రాలు స్వీకరించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) గతవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే సదరు రోగి లేదా చెల్లింపుదారుడి పాన్ లేదా ఆధార్ వివరాలు సేకరించడం సహా వారి మధ్య సంబంధం తెలుసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి మే 31వ తేదీ మధ్య నగదు రూపంలో చెల్లించే చెల్లింపులకు సడలింపు మంజూరు చేసినట్లు తెలిపింది.
2016 నవంబర్ డీమానిటైజేషన్ తర్వాత నల్లధనం ప్రవాహాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా రూ.2 లక్షలకు పైగా నగదు చెల్లింపులపై 2017 నుండి నిషేధించారు. ఇంత మొత్తాన్ని నగదు రూపంలో పొందిన ఏ వ్యక్తికైన 100 శాతం జరిమానా విధిస్తారు.’పేయీ’ అంటే చెల్లింపుదారుని సూచిస్తున్నదని, కానీ బిల్లు చెల్లించే వ్యక్తిని కాదని, కాబట్టి ‘పేయీ’ (చెల్లింపుదారు) పదాన్ని సరిదిద్దాలని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మే 7వ తేదీన జారీ చేసిన ‘పేయీ’కి బదులు ‘పేయర్’ (చెల్లింపుదారు) అని చదవవలసి ఉంటుందని ఆర్థికమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ లో వివరించింది.