బంజారాహిల్స్,మే 9: మెడికల్ షాపులోకి వెళ్లి, మందులు కొనుక్కుని వచ్చేసరికి కారు మాయమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.వెంకటశివయ్య కుమారుడు శ్రీహర్ష బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని పంచవటికాలనీలోని ఐఏఎస్ సొసైటీలో నివాసముంటున్నాడు. శనివారం రాత్రి ఏడున్నర ప్రాంతంలో కొన్ని మందుల కోసం తన నిస్సాన్ సన్నీ కారు (ఏపీ 09సీజే0679)లో రోడ్ నంబర్ 10లోని మెడిప్లస్ మెడికల్ స్టోర్కు వెళ్లాడు. తొందరలో కారు తాళాలు కారులోనే ఉంచిన శ్రీహర్ష లోనికి వెళ్లి పదినిమిషాల్లో తిరిగి వచ్చి చూడగా కారు మాయమైంది. గుర్తు తెలియని వ్యక్తి కారును తస్కరించాడంటూ బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.