ముంబై: బాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్కి చెందిన ఎన్డీ ఫిల్మ్ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 2008లో హృతిక్ రోషన్, ఐశ్వర్యా రాయ్ కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ‘జోధా అక్బర్’ సినిమా సెట్ పూర్తిగా కాలి బూడిదయ్యింది. మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లా ఖలాపూర్ సమీపంలో ఎన్డీ ఫిల్మ్ స్టూడియో ఉన్నది. అందులో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో స్టూడియో మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. స్టూడియోలో ఉన్న ప్లైవుడ్, పీఓపీ, ఇతర సామాగ్రీ అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి