బుల్లితెర ప్రేక్షకులని ఎంతగా అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. అన్ని ప్రాంతీయ భాషలలో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న ఈ షో తెలుగులో నాలుగు ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. అయిదో ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా వలన గత ఏడాది ఆలస్యంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ ఏడాది కూడా కొంత లేట్గానే మొదలు కానుందని టాక్.
ఇటీవల యాజమాన్యం అధికారిక యూ ట్యూబ్ ఛానెల్ లో ‘మీరు బిగ్బాస్ షో’ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేపై వీక్షకుల నుంచి అనుహ్య స్పందన రావడంతో వీలైనంత త్వరగా షోను ప్రారంభించాలని అనుకుంటున్నారట. గత ఏడాది కన్నా ఈ ఏడాది కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో చాలా జాగ్రత్తలు తీసుకొని షోను ప్రారంభించే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కంటెస్టెంట్స్ ఎంపీక దాదాపు పూరైందనట్లు కూడా సమాచారం. ఆగస్ట్లో షో ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సారి కూడా షోకు నాగార్జుననే హోస్ట్గా ఉంటారని తెలుస్తుంది.