నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో రౌండ్ రౌండ్లోనూ కారు దూసుకుపోతోంది. రౌండ్ రౌండ్లోనూ టీఆర్ఎస్ భారీగా మెజార్టీగా దిశగా దూసుకెళ్తుండటంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు.. వరుసగా తొలి ఆరు రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి మంచి ఆధిక్యాన్ని కనబరిచారు. ఆరో రౌండ్ ముగిసే సరికి 5,177 ఓట్ల మెజార్టీతో నోముల భగత్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్లో టీఆర్ఎస్కు 3,854, కాంగ్రెస్కు 3113 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోలయ్యాయి. నాలుగో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 4,186 ఓట్లు, కాంగ్రెస్ కు 3,202 ఓట్లు వచ్చాయి. ఐదో రౌండ్టో టీఆర్ఎస్కు 3,442, కాంగ్రెస్ కు 2676, బీజేపీకి 74 ఓట్లు పోలయ్యాయి. ఆరో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 3,989, కాంగ్రెస్ పార్టీకి 3,049 ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబుళ్లపై లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో 25 రౌండ్లలో లెక్కింపు పూర్తికానుంది. సాయంత్రం ఏడు గంటల వరకు అధికారికంగా విజేతను ప్రకటించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా కొవిడ్ నిబంధనల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులతో సహా పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. కౌంటింగ్లో 400 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.