దేవరకద్ర రూరల్, మే1: రాష్ట్రంలో ప్రజల ప్రాణాలే ముఖ్యం.. దానికోసం ప్రభుత్వం ఎంతైనా ఖర్చు భరించి వైద్యాన్ని అందిస్తున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని డోకూరు సమీపంలోని కేజీబీవీలో కొవిడ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వైరస్ గ్రామాల్లో కూడా విస్తరిస్తున్నందునా కరోనా వైరస్ సోకిన వారి కోసం ఐసోలేషన్ సౌకర్యాలు చేసే క్రమంలో కేజీబీవీల్లోనూ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ టీకాను తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం బస్వాయిపల్లి నుంచి దేవరకద్ర వరకు కొత్తగా నిర్మాణం చేపట్టిన బీటీ రోడ్డు పనులు పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, తాసిల్దార్ జ్యోతి, మండల వైద్యాధికారి షబానాబేగం, నాయకులు పాల్గొన్నారు.