ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మన్ మొయిన్ అలీ అర్ధశతకం సాధించాడు. 33 బంతుల్లో 3 ఫోర్లు, 5సిక్సర్ల సాయంతో హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో డుప్లెసిస్ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇద్దరు బ్యాట్స్మెన్ ధనాధన్ బ్యాటింగ్తో చెలరేగుతుండటంతో చెన్నై భారీ స్కోరు దిశగా సాగుతోంది. నీషమ్ వేసిన 10వ ఓవర్లో అలీ ఒక సిక్స్, రెండు ఫోర్లు కొట్టి 18 రన్స్ రాబట్టాడు. 10 ఓవర్లకు చెన్నై వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. ప్రస్తుతం మొయిన్ అలీ(58), డుప్లెసిస్(31) క్రీజులో ఉన్నారు.