మూసాపేట, ఏప్రిల్23: పెండ్లి చేసుకుంటానని నమ్మించి.. మోసం చేసిన వ్యక్తిని కూకట్పల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ నర్సింగరావు వివరాల ప్రకారం.. అల్వాల్కు చెందిన ఓ మహిళ(26) రెండేళ్ల క్రితం విప్రో సంస్థలో పనిలో చేరింది. అదే సంస్థలో టీం లీడర్గా పనిచేస్తున్న మూసాపేట అంజనేయనగర్కు చెందిన జైఅనే వ్కక్తి పరిచ యమయ్యాడు. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరూ సహజీవనం చేశారు. సొంత కంపెనీ పెడదాం అని జై ఆమె నుంచి రూ. 37 లక్షలు తీసుకున్నాడు. పెండ్లి చేసుకోవాలని కోరగా ముఖం చాటేశా డు. దీంతో బాధితురాలు మార్చి 4న కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న జైని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి అకౌంట్ నుంచి రూ. 32లక్షలను ఫ్రీజ్ చేసి రిమాండ్కు తరలించారు.