నిజాంపేట, ఏప్రిల్ 22: అన్నదాతల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం నిజాంపేటలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం, కరోనా వ్యాక్సిన్ కేంద్రంతో పాటు జెడ్చెరువు తండాలో కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్తో నిజాంపేట మండలంలో 19 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కరోనా టీకా సురక్షితమని, 45 సంవత్సరాలు పైబడిన వారందరూ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, జడ్పీటీసీ విజయ్కుమార్,జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు, మండల వైద్యాధికారి ఎలిజిబెత్రాణి, మండల వ్యవసాయ అధికారి సతీశ్, మండల రైతు బంధు సమితి కో-ఆర్డినేటర్ సంపత్, మండల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్, నిజాంపేట, రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్లు బాపురెడ్డి, చంద్రం, డైరెక్టర్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మండల సర్పంచులు అనూష, అరుణ్కుమార్, అమరసేనారెడ్డి, ఎంపీటీసీలు లహరి, బాల్రెడ్డి, రామాయంపేట ఏఎం సీ డైరెక్టర్లు వెంకటేశం, మంగ్యానాయక్, జిల్లా రజక సంఘం అధ్యక్షుడు స్వామి, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీనర్సింహులు, సత్యనారయణ, వైద్య సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.
రైతును రాజును చేయడమే లక్ష్యం : ఎమ్మెల్యే మదన్రెడ్డి
మనోహరాబాద్, ఏప్రిల్ 22 : సీఎం కేసీఆర్ రైతును రాజును చేయడమే లక్ష్యమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. శివ్వంపేట, గోమా రం గ్రామాల్లో పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డితో కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి, కొల్చా రం మండలాల్లో గోదావరి జలాలు వచ్చాయని త్వరలోనే శివ్వంపేట మండలానికి కాళేశ్వరం జలాలు రానున్నాయన్నారు. కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు లావణ్యమాధవరెడ్డి, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
మాసాయిపేటలో…
వెల్దుర్తి, ఏప్రిల్ 22: రైతులను ఆదుకోవడం కోసమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నా రు. మండల కేంద్రమైన మాసాయిపేట తో పా టు మండల పరిధిలోని రామంతాపూర్లో కొనుగోలు కేంద్రాలను తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, సర్పంచ్లు మధుసూదన్రెడ్డి, ప్రణిత, గోపి, ఎంపీటీసీలు కృష్ణారెడ్డి, సోని, సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, డైరెక్టర్ నర్సింహులు, ఉప సర్పంచ్ నాగరాజు, మాజీ ఎంపీటీసీ సిద్ద్ధింలుగౌడ్, బాలేశ్, యాదగిరి, పలువురు వార్టు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి:జడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్గౌడ్
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్లో పీఏసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహే శ్, ఎంపీపీ పురం నవనీత, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, ముదిరాజ్ మహాసభ జిల్లా నాయకుడు చం ద్రశేఖర్ ముదిరాజ్, నాయకులు నత్తి మల్లేశ్, పంజా భిక్షపతి, పెంటాగౌడ్, పాల్గొన్నారు.