మక్తల్టౌన్, ఏప్రిల్ 21: పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం నిరాడంబరంగా జరిగింది. బుధవారం ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకుల సమక్షంలో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఏటా వైభవంగా రామ్లీలా మైదానంలో నిర్వహించేవారు. ఈ ఏడాది కరోనా సెకండ్వేవ్ వ్యాప్తి చెందుతున్నందున కల్యాణోత్సవానికి భక్తులకు అనుమతివ్వలేదు. అర్చకులు బీమాచారి, ప్రాణేష్ఆచారి, రాఘవేంద్ర ఆచారి స్వామివారి కల్యాణం జరిపించారు. వేడుకకు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హాజరై తలంబ్రాలు ఇచ్చారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యే చిట్టెంను ఆశీర్వదించి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతిని రద్దు చేశారని, నియోజకవర్గ ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని తెలిపారు. కార్యక్రమంలో ఈవో సత్యనారాయణ, నాయకులు శ్రీనివాస్గుప్తా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనిల్, ఎస్సై రాములు, శేఖర్రెడ్డి, తాయప్ప, రామలింగం, గోవర్ధన్ రెడ్డి, రాజమహేందర్రెడ్డి, గోవింద్రావు, కర్రెం కృష్ణ, నేతాజీ తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేటలో..
నారాయణపేట, ఏప్రిల్ 21: పట్టణంలో బుధవారం శ్రీరామనవమి వేడుకలను నిరాడంబరంగా జరుపుకొన్నారు. శ్రీసంత్ మఠ మూల మహాసంస్థానంలోని రామమందిరంలో స్వామి వారికి సుప్రభాతసేవ, అభిషేకం, తులసి అర్చన, పుష్పార్చన నిర్వహించారు. అనంతరం డోలారోహణం, సీతారాముల కల్యాణం, మహా నివేదన, మహామంగళహారతి తదితర కార్యక్రమాలు చేశారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు కార్యక్రమంలో పాల్గొనగా, శక్తిపీఠం వ్యవస్థాపకులు ఆయనను శేషవస్త్రంతో సన్మానించారు. అదేవిధంగా బ్రాహ్మణవాడిలోని రామమందిరంలో రాఘవేంద్రజోషి ఆధ్వర్యంలో డోలారోహణ కార్యక్రమం చేపట్టారు.
నారాయణపేట మండలంలో..
నారాయణపేట రూరల్, ఏప్రిల్ 21: మండలంలోని జాజాపూర్ ఆంజనేయస్వామి ఆలయం, అప్పిరెడ్డిపల్లిలోని రామమందిరంలో, ఎక్లాస్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారు. అప్పిరెడ్డిపల్లిలో కల్యాణరాముడికి సర్పంచ్ ప్రభావతిసుభాన్రెడ్డి పట్టువస్రాలు సమర్పించారు. పేట ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డిస్వామి స్వామివారిని దర్శించుకొన్నారు.
మరికల్లో..
మరికల్, ఏప్రిల్ 21: సీతారాములు కల్యాణం వేడుకలను మండల కేంద్రంలో బుధవారం వైభవంగా నిర్వహించారు. మరికల్ ఆంజనేయస్వామి ఆలయం వద్ద, మాధవరం రోడ్డు వద్ద, తీలేరు, పల్లేగడ, పూసల్పాడ్, చిత్తనూర్, కన్మనూర్, మాధవరంలో సీతారాములకు కల్యాణం ఘనంగా జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలో యువకులు జై శ్రీరామ్ నినాదాలు చేశారు. మండల కేంద్రంలో తలంబ్రాలను సర్పంచ్ కస్పే గోవర్ధన్ దంపతులు, తాసిల్దార్ నాగలక్ష్మి దంపతులు తీసుకెళ్లారు.
దామరగిద్ద మండలంలో..
దామరగిద్ద, ఏప్రిల్ 21: మండలంలోని ఆయా గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు కొవిడ్ నిబంధనల మేరకు నిర్వహించారు. మండల కేంద్రంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాల వితరణ చేశారు. కార్యక్రమంలో హౌజి రఘువీర్, శ్రీధర్, భక్తులు పాల్గొన్నారు.
ధన్వాడలో..
ధన్వాడ, ఏప్రిల్ 21: మండల కేంద్రంతోపాటు రాంకిష్టయ్యపల్లి, కిష్టాపూర్, గోటూర్, చర్లపల్లి, కంసాన్పల్లి, పాతపల్లి గ్రామాల్లో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ధన్వాడ లక్ష్మీవేంకటేశ్వర ఆలయంలోని సీతారాముల కల్యాణానికి సర్పంచ్ చిట్టెం అమరేందర్రెడ్డి పట్టువస్ర్తాలను సమర్పించారు. కరోనా నిబంధనలతో కల్యాణం జరిపించినట్లు ఆలయ పూజారులు తెలిపారు.
ఊట్కూర్లో..
ఊట్కూర్, ఏప్రిల్ 21: శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. పాతపేట బాలహనుమాన్ ఆలయం, మొగ్దుంపూర్, ఓబ్లాపూర్, బిజ్వారం ఆంజనేయ స్వామి ఆలయాల్లో సీతారాముల కల్యాణం జరిపించారు. అదేవిధంగా స్థానిక ఆర్య సమాజ్ మందిరంలో పలువురు దంపతులు పాల్గొని యజ్ఞం చేశారు. అగ్నికి సామగ్రి, నెయ్యి, సుగంధం సమర్పించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, ఎంపీటీసీ హన్మంతు, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఆర్య సమాజ్ ప్రధాన్ కనకప్ప ఆర్య, నిర్వాహకులు ముద్దం రాము, వెంకటేశ్గౌడ్, అశోక్, బాబు, జ్ఞానేశ్వర్రావు ఆర్య పాల్గొన్నారు.