లక్నో : కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రయాగరాజ్, లక్నో, వారణాసి, కాన్పూర్, గోరఖ్ పూర్ నగరాల్లో లాక్డౌన్ విధించబోమని యూపీ ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. ఈ ఐదు నగరాల్లో కఠిన లాక్డౌన్ విధించాలని అలహాబాద్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించిన క్రమంలో యోగి ఆదిత్యానాథ్ సర్కార్ ఈ మేరకు వెల్లడించింది.
ఈ నగరాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయబోమని, అయితే కరోనా కట్టడికి కఠిన నియంత్రణలు విధిస్తామని హైకోర్టుకు యూపీ సర్కార్ నివేదించింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ ఐదునగరాల్లో ఏప్రిల్ 26 వరకూ లాక్డౌన్ అమలు చేయాలని అలహాబాద్ హైకోర్టు యోగి సర్కార్ ను ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సాధ్యం కాదని తేల్చిచెప్పింది.