వికారాబాద్ : దేశం గర్వించదగ్గ నేతల్లో అంబేద్కర్ అగ్రభాగాన ఉంటారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గముం హస్నాబాద్, చిట్లపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో కలిసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. నాడు అంబేద్కర్ రచించిన పటిష్ట రాజ్యాంగం వల్లే నేడు మన దేశం గొప్ప దేశంగా, అగ్ర స్థానానికి దూసుకుపోతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో అంబేద్కర్ ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మహనీయుడి స్ఫూర్తితో పాలన అందిస్తున్నారని ఆమె తెలిపారు. సంపద పెరగాలి అందరికి సమానంగా పంచాలి అన్నదే అంబేద్కర్ ఆలోచన అన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
జ్ఞానాన్ని ఎల్లలు దాటించిన అంబేద్కర్: మంత్రి హరీశ్
ఖమ్మంలో ఆక్సిజన్ ఉత్పత్తి సెంటర్ ప్రారంభం
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ