షాబాద్, ఏప్రిల్ 7: మున్సిపాలిటీల్లో ఏర్పడ్డ ఖాళీలకు పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారతి తెలిపారు. బుధవారం జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ… కమిషనర్, డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్టేషన్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారని చెప్పారు. ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని చెప్పారు. రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా ఏర్పాటైన కొత్తూర్ మున్సిపాలిటీలో 12 వార్డులున్నాయని, 8.136 మంది ఓటర్లున్నారన్నారు. జల్పల్లి మున్సిపాలిటీలో 28వ వార్డుకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. దీని కోసం డ్రాఫ్ట్ ఫొటో ఎలక్టరోల్ డిస్లే చేశామన్నారు. పోలింగ్ స్టేషన్లను గుర్తించి మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొవిడ్ నిబంధనల మేరకు శానిటైజర్, కిట్లు ఏర్పాటు చేస్తామని, ఓటర్లు జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు పోలింగ్ సిబ్బంది కోసం రాండమైజేషన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ సీఈవో దిలీప్కుమార్ ఉన్నారు.
ఇవీ కూడా చదవండీ..
స్కోప్ సమావేశానికి ఉపాధ్యాయుడికి ఆహ్వానం
నల్లగొండకు వచ్చిన సునీల్ కుమార్ మీనా
కమల్ హాసన్ మిస్టర్ పర్ఫెక్ట్.. అప్పుడే షూటింగ్కు వచ్చేసాడు