కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని, పాణ్యం ఏరియాల్లో అతిసార వ్యాధి కలకలం రేపుతున్నది. ఆయా ప్రాంతాల్లో అతిసార వ్యాధి ప్రబలి ఇప్పటికే నలుగురు వ్యక్తులు మృతిచెందారు. ఆదోని అరుణజ్యోతి నగర్లో 25 మంది అస్వస్థతకు గురయ్యారు. వివిధ గ్రామాల్లోని అతిసార బాధితులు ఆదోని, నంద్యాల ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దాంతో ఆ రెండు ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. పాణ్యం మండలం గోరుకల్లులో అతిసార కారణంగా నీటి సరఫరాను నిలిపివేశారు. నంద్యాల నుంచి గోరుకల్లుకు ట్యాంకర్ల ద్వారా అధికారులు నీటిని సరఫరా చేయిస్తున్నారు.