హైదరాబాద్ : డిజిటల్ తరగతుల ద్వారా పొందిన అవగాహనను మరింత బలోపేతం చేసేలా పదో తరగతి స్టడీ మెటీరియల్ విడుదలైంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ-స్టడీ మెటీరియల్ను విడుదల చేశారు. పాఠ్యాంశాల్లోని కీలక అంశాలు అర్థమయ్యేలా స్టడీ మెటీరియల్ రూపకల్పన జరిగింది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో రూపొందించిన స్టడీ మెటీరియల్ www.scert.telangana.gov.in లో అందుబాటులో ఉంది.