హైదరాబాద్: దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీ కరణ్ పురస్కారానికి సంగారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఎంపిక కావడం పట్ల ఆర్థిక మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో స్థానిక సంస్థలకు ప్రతి ఏడాది ఈ అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, ఇతర అధికారులు మంత్రి హరీశ్ రావును కలిశారు. అవార్డు సాధించే దిశగా జిల్లా పరిషత్తు సిబ్బంది చేసిన కృషిని ఆయన అభినందించారు. ఈ అవార్డు సాధించడంలో భాగస్వామ్యులైన ప్రతీ ఒక్కరు అభినందనీయులన్నారు. ఇదే విధంగా జిల్లాపరిషత్ ముందుకు సాగాలని, దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. మరిన్ని జాతీయ అవార్డులు సాధించాలని, ప్రజలకు అన్ని విధాలుగా ఉత్తమ సేవలు అందించేలా కృషి చేయాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..