హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు కురిపించిన సీఎం కేసీఆర్కు టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మార్త రమేశ్, వరంగల్ జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్సీ, పదవీ విరమణ వయసు పెంపుపై హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అన్నిస్థాయిల్లో పనిచేస్తున్న 9,17,869 మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పార్టు టైం, కాంటింజెంట్ ఉద్యోగులకు ఒకే వేతన సవరణ అమలు నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు. కరోనా కష్టకాలంలోనూ సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు.