మెట్రోస్టేషన్లో ఆవిష్కరించిన ఉమెన్సేఫ్టీ వింగ్ అధికారులు
హైదరాబాద్, మార్చి 15, (నమస్తే తెలంగాణ): మహిళా భద్రత కోసం చేపట్టిన చర్యల్లో భాగంగా క్యూఆర్ కోడ్తో ఫిర్యాదుచేసే విధానంపై సోమవారం పెద్దఎత్తున చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులోభాగంగా లక్డీకాపూల్ మెట్రోస్టేషన్లో క్యూఆర్ కోడ్ ఫిర్యాదు పోస్టర్లను మహిళా భద్రతావిభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి ఆవిష్కరించారు. మహిళా ప్రయాణికులు, మెట్రోరైల్ సిబ్బందికి క్యూఆర్ కోడ్ను స్కాన్చేసి, ఫిర్యాదు ఎలా చేయాలన్నదానిపై సూచనలు చేశారు. ఈవ్టీజింగ్, మొబైల్ ఫోన్, ఆన్లైన్ద్వారా వేధింపులు తదితర సమస్యలపై మహిళలు ఫిర్యాదు చేయవచ్చని అడిషనల్ డీజీ స్వాతిలక్రా తెలిపారు. ఇకపై షీటీమ్స్ వాట్సప్ నంబర్లు గుర్తుంచుకోవాల్సిన పనిలేకుండా ఈ స్కాన్తో నేరుగా మహిళా భద్రతా విభాగానికి ఫిర్యాదు చేయవచ్చని డీఐజీ సుమతి సూచించారు.