హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ )/ కమాన్చౌరస్తా: తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. మహిళలు, యువతకు ఒక ఐకాన్ అని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కవిత జన్మదినం సందర్భంగా జాగృతి కరీంనగర్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ముందస్తు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జాగృతి జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్ రచించి, పాడిన పాట సీడీని మంత్రి ఆవిష్కరించారు. జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ప్రజలకు, గల్ఫ్ బాధితులకు, బీడీ కార్మికులకు అందించిన సేవలను కొప్పుల కొనియాడారు. కార్యక్రమంలో జాగృతి మహిళా రాష్ట్ర కో కన్వీనర్ గందె కల్పన, జాగృతి సీనియర్ నాయకులు బానోతు కిషన్నాయక్, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ ఎంఏ రజీ, యూత్ విభాగం జిల్లా కన్వీనర్ ఉయ్యాల విష్ణువర్ధన్, పెద్దపల్లి జిల్లా సాహితీ విభాగం కన్వీనర్ నూతి మల్లయ్య, జిల్లా పీఆర్వో గాలిపల్లి రత్నాకరాచారి, రవికాంత్, జాడి సౌమిత్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియాశాఖ ఆధ్వర్యంలో ఎమ్మె ల్సీ కవిత జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, ఆడిలైడ్ పట్టణాల్లో ఆస్ట్రేలియాశాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలు జరుపుకొన్నా రు. కేక్ కట్ చేసి.. అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నాగేందర్రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మను ప్రపంచవ్యా ప్తం చేసిన ఘనత కవితకే దక్కుతుందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తంగా చేశారని కొనియాడారు. వివిధ ప్రాం తాల్లో జరిగిన కార్యక్రమాల్లో రవి సాయిల, రాకేశ్ లక్కరసు పాల్గొన్నారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కూతురు ఝాన్సీ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో కవిత పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.