భోపాల్: ఒక చిరుత ఐదుగురిపై దాడి చేసింది. రెస్క్యూ కోసం వచ్చిన ఒక పోలీస్ను గాయపరిచింది. దానిని బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. న్యూ రాణి బాగ్ ప్రాంతంలోని ఖాండ్వా రోడ్ వద్ద గురువారం ఒక చిరుత పులి హల్చల్ చేసింది. ఒక చిన్నారి, ఆమె తల్లితోసహా ఐదుగురు స్థానికులపై దాడి చేసింది. అనంతరం నిర్మాణంలో ఒక భవనంలోకి ఆ చిరుత ప్రవేశించింది.
విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీశాఖ సిబ్బంది దానిని బంధించేందుకు అక్కడకు వచ్చారు. అంతలో ఒక పోలీస్పై చిరుత దాడి చేయడంతో స్వల్పంగా గాయపడ్డారు. మత్తు ఇంజక్షన్లు, వలలు ఉన్నప్పటికీ అటవీశాఖ, జూ సిబ్బంది దానిని బంధించలేకపోయారు. ఆ చిరుతను పట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోలీస్పై చిరుత దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
https://www.youtube.com/embed/q9-OqYtFALE
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.