ఈ ఏడాది క్రాక్ సినిమాతో పలకరించిన రవితేజ ప్రస్తుతం ఖిలాడి అనే చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ప్లే స్మార్ట్’ అనేది ట్యాగ్లైన్ . ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మే 28న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్తో పాటు రెండు పాటలను చిత్రీకరించేందుకు చిత్రబృందం ప్లాన్ చేసిందని తెలిసింది.
ఖిలాడి చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా, ఇందులో అర్జున్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కూడా రవితేజకు మంచి హిట్ అందించడం ఖాయం అని అంటున్నారు మేకర్స్ . మరోవైను రవితేజ ఇటీవల లన 68వ సినిమాకు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేర్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.