జైపూర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2021లో మాజీ క్రికెటర్లు దుమ్మురేపుతున్నారు. మాజీ స్టార్ బ్యాట్స్మెన్లు తమదైన బ్యాటింగ్ శైలితో రెచ్చిపోతున్నారు. మంగళవారం ఇండియా లెజెండ్స్తో మ్యాచ్లో ఇంగ్లాండ్ లెజెండ్స్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్(75: 37 బంతుల్లో 6ఫోర్లు, 5సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇండియా టీమ్పై పీటర్సన్ కేవలం 18 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. రోడ్ సేఫ్టీ సిరీస్లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించాడు. 20 ఓవర్లలో ఇంగ్లాండ్ 7 వికెట్లకు 188 రన్స్ చేసింది. ఇండియా బౌలర్లలో యూసుఫ్ పఠాన్ మూడు వికెట్లు తీయగా మునాఫ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.