ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). తొలితరం స్వాతంత్య్రసమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం జీవితాలకు ఫిక్షన్ అంశాలను జోడిస్తూ దాదాపు నాలుగు వందల కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పతాక ఘట్టాల చిత్రీకరణ జరుగుతోంది. ఎన్టీఆర్, రామ్చరణ్లుపాల్గొనగా హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ సారథ్యంలో భారీ పోరాట ఘట్టాల్ని చిత్రీకరిస్తున్నారు. ైక్లెమాక్స్ పూర్తయిన తర్వాత ఈ నెల 12 నుంచి రామ్చరణ్, అలియాభట్లపై రొమాంటిక్ గీతాన్ని చిత్రీకరించేందుకు దర్శకుడు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పాట కోసం 1920ల నాటి కాలాన్ని తలపించేలా చారిత్రక హంగులతో హైదరాబాద్లో ప్రత్యేక సెట్ను తీర్చిదిద్దినట్లు తెలిసింది. ఈ సెట్లోనే ప్రత్యేకంగా పాటను తెరకెక్కించనున్నట్లు సమాచారం. అక్టోబర్ 13న ఈ సినిమా విడుదలకానుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.