అయోధ్య, మార్చి 4: అయోధ్యలో రామజన్మభూమి ప్రాంగణానికి ఆనుకొని ఉన్న 7,285 చదరపు అడుగుల స్థలాన్ని రామ జన్మభూమి ట్రస్ట్ కొనుగోలు చేసింది. ఆలయ నిర్మాణ విస్తీర్ణాన్ని ప్రస్తుతమున్న 70 ఎకరాల నుంచి 170 ఎకరాలకు విస్తరించాలన్న ప్రణాళికకు అనుగుణంగా తొలి విడుత భూ సేకరణ పూర్తయిందని ట్రస్ట్ అధికారి ఒకరు తెలిపారు. ఇంకా 14,30,195 చదరపు అడుగుల స్థలాన్ని సేకరించాలని ట్రస్ట్ భావిస్తున్నది.