కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సామాజిక నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటుంది. కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు రీసెంట్గా చిత్ర బృందం మారేడుమిల్లికి వెళ్లింది. చిరంజీవి, రామ్ చరణ్లపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని తెలుసుకున్న అక్కడి గ్రామస్తులు లొకేషన్కు వద్దకు భారీగా చేరుకున్నారు. వారికి చిరంజీవి, రామ్ చరణ్ అభివాదం చేశారు.
ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్లకు సంబంధించి పలు ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇద్దరు వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్లలో మెరిసిపోతున్నారు. ఈ ఫొటోలు చూసి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఆచార్య చిత్రం మే 13న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Mega Power Star @AlwaysRamCharan And @KChiruTweets Garu From #Acharya Shoot !#Siddha #RamCharan pic.twitter.com/pjKOW6B8L1— RamCharan Addicts™ (@FansOfRamCharan) February 24, 2021