ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి
కాగజ్నగర్ రూరల్, సెప్టెంబర్ 19: విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి అన్నారు. పట్టణంలోని వినయ్ గార్డెన్లో పీఆర్టీయూ టీఎస్ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించారన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తూ విద్యాభివృద్ధికి పాటుపడాలన్నారు. అనంతరం జిల్లా పీఆర్టీయూ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు, వివిధ మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.