జైనథ్, సెప్టెంబర్ 19: మండలంలోని మాండగాడ, గిమ్మ, కాప్రిలో వ్యాక్సినేషన్ కేంద్రాలను జడ్పీటీసీ తుమ్మల అరుంధతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జైనథ్ మండలంలో100 శాతం వ్యాక్సిన్ పూర్తి చేసేందుకు అధికారులు, వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇందు మహేందర్రావు, వెంకట్రెడ్డి, వైద్యసిబ్బంది, అంగన్వాడీ, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
బేల, సెప్టెంబర్ 19: మండలంలోని సైద్పూర్, చప్రాల, పిట్గావ్, మోహబత్పూర్, గ్రామాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను మండల ప్రత్యేకాధికారి శంకర్, ఎంపీడీవో భగత్ రవీందర్ పరిశీలించారు. వారి వెంట మండల పంచాయతీ అధికారి సమీర్హైమద్, ఐకేపీ ఏపీఎం కిరణ్కుమార్, సర్పంచ్లు వట్టిపెల్లి ఇంద్రశేఖర్, ఖోడే విపిన్, దౌలత్పటేల్, పీహెచ్సీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.
తాంసి, సెప్టెంబర్ 19: కొవిడ్ టీకాపై అపోహలు వీడాలని జడ్పీటీసీ రాజు అన్నారు. బండలనాగాపూర్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. కొవిడ్ టీకాపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీవో సుధీర్రెడ్డి, సర్పంచ్ గంగుల వెంకన్న, పంచాయతీ కార్యదర్శి హమీద్, నాయకులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
బోథ్, సెప్టెంబర్ 19: మండలంలో వంద శాతం వ్యాక్సినేషన్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీడీవో సీహెచ్ రాధ అన్నారు. మండలంలోని పొచ్చెర, బోథ్, కరత్వాడ, పట్నాపూర్, ధన్నూర్(బీ) గ్రామాల్లో వ్యాక్సినేషన్ను పరిశీలించారు. కార్యక్రమాల్లో సొనాల పీహెచ్సీ డాక్టర్ నవీన్రెడ్డి , హెచ్ఈ వెంకటలక్ష్మి, సూపర్వైజర్లు నర్సింహస్వామి, కళావతి, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, ఆశకార్యకర్తలు, వీవోఏలు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, సెప్టెంబర్ 19: శ్యాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రాన్ని డీఎల్పీవో భిక్షపతిగౌడ్ పరిశీలించారు. వ్యాక్సిన్పై గ్రామ ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 19: మండలంలోని హర్కాపూర్, ఆంద్గూడ, దస్నాపూర్, వడగాం గ్రామాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 230 మందికి టీకా వేశామని డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు.కార్యక్రమంలో సీహెచ్వో బాబూలాల్, సర్పంచ్లు కైలాస్, జావదే పార్వతీబాయి, ఆత్రం రత్తుబాయి పాల్గొన్నారు.
నార్నూర్, సెప్టెంబర్ 19: మండల కేంద్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను సామాజిక ఆరోగ్యం కేంద్రం మెడికల్ అధికారి విజయ్కుమార్ పరిశీలించారు. వ్యాక్సినేషన్ తీరును అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి కొవిడ్ నియంత్రణకు టీకా తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట హెచ్ఈవో చౌహాన్ నాందేవ్, హెచ్ఏ ఈశ్వర్, పంచాయతీ కార్యదర్శి అనురాగ్, వైద్య సిబ్బంది ఉన్నారు.
నార్నూర్, సెప్టెంబర్ 19: వ్యాక్సిన్ తీసుకునేందుకు గిరిజనులు నిరాకరిస్తుండడంతో గాదిగూడ జడ్పీటీసీ మెస్రం గంగుబాయిసోము, సార్మేడీలు, గ్రామ పెద్దలు మండలంలోని హీరాపూర్, కొలాంగూడ, ఎస్సీగూడ, బొజ్జుగూడ, లొద్దిగూడ, ఖండో, రాంపూర్లో అవగాహన కల్పిం చారు. కార్యక్రమంలో సార్మేడీలు మడావి జగ్గేరావ్, మండాడి దౌలత్రావ్, నాయకులు భగవన్కాంబ్లే, పంచాయతీ కార్యదర్శులు, గ్రామపెద్దలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కొవిడ్ టీకా తీసుకున్న శతాదిక వృద్ధుడు
భీంపూర్, సెప్టెంబర్18: భీంపూర్లో కొవిడ్ టీకా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వందేళ్లు నిండిన చౌహాన్ విఠల్ టీకా తీసుకోవడంతో మరి కొంత మంది వృద్ధులు టీకా వేసుకున్నారు. ఏఎన్ఎం జనాబాయి, ఆశకార్యకర్త భారతి, కార్యదర్శి సాయినందన, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.