ఆదిలాబాద్ రూరల్, జూలై 19:ఆదిలాబాద్ పట్టణంలో సోమవారం పూరి జగన్నాథుడి రథయాత్ర కనుల పండువగా కొనసాగింది. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించగా.. భక్తులు భారీగా తరలి వచ్చారు. రథయాత్ర ముందు భక్తులు నృత్యాలు చేస్తూ.. వాయిద్యాలు వాయిస్తూ భగవంతుడిపై గీతాలు ఆలపించారు. కాగా.. ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథయాత్రకు ముందు భాగంలో రహదారులు శుభ్రం చేశారు.
ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో పూరీ జగన్నాథుడి రథయా త్రను ఆదిలాబాద్ పట్టణంలో సోమవారం శోభాయమా నంగా నిర్వహించారు. మధుర జిన్నింగ్ ప్రాంతంలోని ఆల యం నుంచి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు నృత్యాలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఇస్కాన్ సంస్థ సభ్యులు వాయిద్యాలను వాయిస్తూ భక్తి గీతాలు ఆలపించారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ జగన్నాథుడి రథ యాత్రలో పాల్గొనడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ భగ వంతుడిని వేడుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గోపాల కృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి, జీవ వైవిధ్య కమిటీ సభ్యుడు మర్సుకోల తిరుపతి, కౌన్సిలర్ బండారి సతీశ్, పాల్గొన్నారు.