కడెం, మే 19: ధరణి కార్యాలయాలతో రైతులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నూతనంగా ధరణి కార్యాలయ భవన నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. పనులు తుది దశకు చేరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఖలీం, నాయబ్ తహసీల్దార్ చిన్నయ్య, ఆర్ఐలు శ్రీనివాస్, రాజన్న, కార్యాలయ సిబ్బంది, తదితరులున్నారు.
ధాన్యం కొనుగోలులో జాప్యం చేయవద్దు
దస్తురాబాద్, మే19 : ధాన్యం కొనుగోలులో జాప్యం చేయవద్దని అడిషనల్ కలెక్టర్ రాంబాబు నిర్వాహకులకు సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తూకం వేసిన వెంటనే ఎప్పటికప్పుడు ధాన్యం తరలించేలా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని తహసీల్దార్ గజానన్కు సూచించారు.
తహసీల్దార్ కార్యాలయం తనిఖీ
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. పలు భూ రికార్డులను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయం పక్కన చేపట్టిన ధరణి భవన నిర్మాణాన్ని పరిశీలించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం గొడిసెర్యాలలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజరి లక్ష్మణ స్వామి అడిషనల్ కలెక్టర్, తహసీల్దార్ను సన్మానించారు.కార్యక్రమంలో ఆర్ఐ గంగన్న, వీఆర్వోలు శివకృష్ణ గౌడ్, విశ్వనాథ్, డిప్యూటీ సర్వేయర్ సంధ్యారాణి, ఏపీఎం గంగాధర్, రెవెన్యూ సిబ్బంది, నిర్వాహకులు ఉన్నారు.