కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర
రెబ్బెన, అక్టోబర్ 18: రక్తదానం మహాదానమని, ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర పిలుపునిచ్చారు. రెబ్బెనలోని కేకే గార్డెన్ లో సోమవారం ‘పోలీసులు మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెబ్బెన పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎస్పీ సుధీంధ్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాతలను అభినందించి, 166 మందికి సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్, ఎస్ఐ భవానిసేన్, పీఎస్ఐ సోనియా, ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోశ్, రెబ్బెన సర్పంచ్ బొమ్మినేని అహల్యా దేవి, పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం సంజీవ్కుమార్, వైస్ చైర్మన్ రంగు మహేశ్గౌడ్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు చెన్న సోమశేఖర్, ఎంపీటీసీలు పెసరి మధునయ్య, సంఘం శ్రీనివాస్, కో ఆప్షన్ మెంబర్ జౌరొద్దీన్, ఆలయ డైరెక్టర్ వినోద్జైస్వాల్, ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, మాజీ ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, నాయకులు నవీన్జైస్వాల్, మోడెం సుదర్శన్గౌడ్, పందిర్ల మధునయ్య, జుమ్మిడి ఆనందరావు, తదితరులున్నారు.
వాంకిడిలో..
అంబేద్కర్చౌక్(ఆసిఫాబాద్) 18: వాంకిడిలో రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర ప్రారంభించారు. అనంతరం 130 మందికి సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సుధాకర్, ఎస్ఐ దీకొండ రమేశ్, ఎంపీపీ విమలబాయి, పీఏసీఎస్ చైర్మన్ పెంటయ్య, వైద్యాధికారి సతీశ్కుమార్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.