ప్రతిష్టాత్మక కార్యక్రమంతో ఆదర్శంగా పెర్కపల్లె
వైకుంఠధామంతో ఆఖరి మజిలీకి తప్పిన తిప్పలు
మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం
దస్తురాబాద్, అక్టోబర్ 17 : పల్లె చిన్నదైనా అభివృద్ధి పనుల్లో ఆదర్శంగా నిలుస్తున్నది. పెర్క పల్లె ఇంతకు ముందు దస్తురాబాద్ గ్రామ పంచా యతీలో ఉండేది. గ్రామ పంచాయతీగా పెర్కపల్లి ఏర్పడడంతో ప్రగతి పథాన దూసుకెళ్తున్నది. జనా భా 830, 166 గృహలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభు త్వం పల్లె ప్రగతిలో భాగంగా నిర్దేశించిన పను లను పాలకవర్గం ప్రణాళికలతో పూర్తి చేసింది. ఫలితంగా గ్రామ పంచాయతీగా అభివృద్ధి బాట లో పయనిస్తున్నది. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో 90 శాతం మురుగుదొడ్లు, ఇంకుడు గుంతలు పూర్తయ్యాయి. సర్సరీలో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్ నిర్మించారు. ఏడో విడుత హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఎవె న్యూ ప్లాంటేషన్ కింద ఆర్ అండ్ బీ రోడ్డుకు ఇరు వైపులా, పంచాయతీ రాజ్ రోడ్డుకు ఇరువైపులా 3540 మొక్కలు నాటారు. వాటికి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. ట్యాంకర్ సాయంతో ప్రతి రోజూ మొక్కలకు నీటి అందిస్తున్నారు.
అభివృద్ధి పనులు…
రూ. 2 లక్షల ఈజీఎస్ నిధులతో, పంచాయతీ రూ. 7.60 లక్షల నిధులతో డ్రైనేజీలను, సీసీ రోడ్ల ను నిర్మించారు. తడి, పొడి చెత్తను వేరు చేయ డానికి రూ. 2.50 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు, రూ. 12.50 లక్షలతో వైకుంఠాధామాన్ని నిర్మించారు. గ్రామ శివారులో 20 గుంటల అటవీ భూమి చదును చేసి పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. అందులో వివిధ రకాల పూలు, పండ్లు, నీడ నిచ్చే మొక్కలను నాటారు. అవి ఏపుగా పెరిగి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. పల్లె ప్రగతి లో భాగంగా విడుదల చేసిన రూ. 12.50 లక్షల తో అన్ని వసతులతో వైకుంఠ ధామం నిర్మించా రు. దహన సంస్కారాల సమస్య తొలగిపోయిం ది. బోరు వేసి నీటి వసతిని కల్పించారు. వివిధ రాకల మొక్కలను నాటారు. ఏపుగా పెరిగి పెద్దగా కావడంతో హరితశోభ సంతరించుకున్నది. వాకిం గ్ ట్రాక్ను ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంప్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డుకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్త ను వేరు చేసి సేంద్రియ ఎరువుల తయారీకి చర్య లు తీసుకుంటున్నారు. కార్మికులు మురుగు కాల్వ లు, రోడ్లు శుభ్రం చేస్తున్నారు. కొత్తగా 15 నూతన స్తంభాలను ఏర్పాటు చేశారు. మూడో తీగను బిగించారు. ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయడం తో గ్రామంలో విద్యుత్ కాంతులు విరజిమ్ముతు న్నాయి. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు…
గ్రామంలో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజూ నీటిని సరఫరా చేస్తున్నారు. లీకేజీలు ఉంటే మరమ్మతులు చేయిస్తున్నారు.