రెబ్బెన, అక్టోబర్ 17 : సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కారు డ్రైవింగ్ శిక్షణకు యువకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది. ఈ సంవత్సరం సెప్టెంబర్లో ఏరియాలోని యువతకు మోటార్ డ్రైవింగ్లో శిక్షణ కోర్సును ప్రారంభించారు. బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇస్తుండడంతో అందరికీ స్వయం ఉపాధికి భరోసా కలుగుతున్నది. రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాచ్ల వారీగా డ్రైవింగ్ శిక్షణ అందిస్తున్నారు. సింగరేణి యాజమాన్యం భూనిర్వాసిత యువతతో పాటు కార్మికుల కుటుంబాలకు, కార్మికేతర కుటుంబాలకు కూడా డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నది. దీనిపై సింగరేణి పరిధిలోని యువత హర్షం వ్యక్తం చేస్తున్నది.
40 మందికి శిక్షణ..
బెల్లంపల్లి ఏరియాలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో చా లా స్వయం ఉపాధి కోర్సులు నిత్యం కొనసాగుతున్నాయి. నూతనంగా మోటార్ డ్రైవింగ్ కోసం శిక్షణ ప్రారంభించారు. ఇందుకోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులోంచి అర్హత కలిగిన వారిని ఎంపిక చేసి కారు డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నారు. గోలేటి టౌన్షిప్లో భూ నిర్వాసిత కాలనీలకు చెం దిన 20 మంది యువతకు, బెల్లంపల్లి పట్టణంలో కార్మిక కు టుంబాలు, మాజీ కార్మికుల కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతలోంచి అర్హత కలిగిన 20 మందిని శిక్షణకు ఎంపిక చేశారు. ఏరియాలో సింగరేణి సేవా సమితి ద్వారా స్వయం ఉపా ధి కోర్సులను అందరూ సద్వినియోగం చేసుకునేందుకు ఏరి యా జీఎం సంజీవరెడ్డి, సేవా అధ్యక్షురాలు రాధాకుమారి విశే ష కృషి చేస్తున్నారు. కారు డ్రైవింగ్ శిక్షణ బయట మోటార్ డ్రై వింగ్ స్కూల్లో తీసుకుంటే చాలా డబ్బులు అవుతాయి. సింగరేణి సేవా సమితి ఉచితంగా శిక్షణ అందించి, లర్నింగ్ లైసెన్స్ కూడా ఇప్పిస్తుండడంపై యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు..
సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తున్న కారు డ్రైవింగ్ శిక్షణతో డ్రైవింగ్లో నైపుణ్యం సాధించిన వారికి యాజమాన్యం డ్రైవింగ్ లైసెన్స్ కల్పించనుంది. ప్రైవేట్గా డ్రైవింగ్ శిక్షణ పొందితే వేలాది రూపాయలు ఖర్చవుతాయి. సింగరేణి సేవా సమితి ఒక్కపైసా తీసుకోకుండా శిక్షణ ఇవ్వడంపై మహిళలు, యువత సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. భవిష్యత్లో మోటార్ డ్రైవింగ్తో పాటు స్వయం ఉపాధికి సంబంధించిన కొత్త కోర్సులపై శిక్షణ ఇస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.