85 మిలియన్ టన్నుల ఉత్పత్తికి సన్నద్ధం
ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసిన సింగరేణి
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎండీ
త్వరలో కాలనీలకు పూర్వవైభవం
తాండూరు, సెప్టెంబర్ 17 : నల్లనేలకు నవశకం రాబోతున్నది. సింగరేణి ఏర్పాటైన కొత్తలో ప్రారంభించిన గనులన్నీ దాదాపు మూతపడే పరిస్థితికి చేరుకోగా, కొత్త ప్రాజెక్టులపై యాజమాన్యం దృష్టి సారించింది. వచ్చే మూడేళ్ల లో పది ప్రాజెక్టులు ప్రారంభిం చనుండగా, 85 మిలియన్ టన్నుల ఉత్పత్తికి సన్నద్ధమ వుతున్నది. సింగరేణి ప్రాంతం లోనే గాకుండా ఒడిశాలోని నైనీ, న్యూ పాత్రపాద బ్లాక్లోనూ బొగ్గు తవ్వకాలు జరిపేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగు తున్నది. సీఎండీ శ్రీధర్ నిత్యం అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ పరుగులు పెట్టిస్తుండగా, త్వరలోనే నల్లనేలకు కొత్త కళ రానున్నది.
సింగరేణి యాజమాన్యం కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండగా.. వచ్చే మూడేళ్లలో కొత్త గనులు ప్రారంభించడమే కాకుండా, అందులో ఉత్పత్తి కూడా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతమున్న 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి అదనంగా 25 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే లక్ష్యం చేయాలని భావిస్తున్నది. అంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి 85 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసేందుకు సిద్ధం అవుతున్నారు. జీడీకే 5 ఓపెన్కాస్టు, జేవీఆర్ ఓపెన్కాస్టు 2 ఎక్స్టెన్షన్, నైనీ బొగ్గు బ్లాక్ కలిపి మొత్తం 10 మిలియన్ టన్నులు ఉత్పత్తి తీయనున్నారు. ఇందులో జీడీకే 5 ఓపెన్కాస్టు నుంచి ఏడాది 30 లక్షల టన్నులు, ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి 100 లక్షల టన్నులు, వీకే కోల్మైన్స్ నుంచి 53 లక్షల టన్నులు, జీడీకే 10 ఇైంక్లెన్ నుంచి 60 లక్షల టన్నుల ఉత్పత్తి తీసేందుకు రంగం సిద్ధం చేశారు. అదే సమయంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంవీకే ఓపెన్కాస్టు నుంచి ఏటా 25 లక్షల టన్నులు, గోలేటి ఓపెన్కాస్టు నుంచి 35 లక్షల టన్నులు, జేకే ఓపెన్కాస్టు 25 లక్షల టన్నులు, తాడిచర్ల ఓపెన్కాస్టు ఉనంచి 50 లక్షల టనులు, పెనగడప ఓపెన్కాస్టు నుంచి 15 లక్షల టన్నులు, న్యూ పాత్రపాద ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి సాధించనున్నారు.
బెల్లంపల్లిలో రెండు ఓపెన్కాస్టులు..
బెల్లంపల్లి ప్రాంతంలో కూడా రెండు ఓపెన్కాస్టులు ప్రా రంభిచేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇక్కడ ఉన్న గ నులు దాదాపు మూతపడగా, ఇక్కడ కేవలం ఖైరిగూడ ఓపెన్కాస్టుతోపాటు, బెల్లంపల్లి ఎక్స్టెన్షన్ మాత్రమే కొనసాగుతున్నాయి. గోలేటీ 1, 1ఏతో పాటు గోలేటీ 2 భూగర్భగనులు, బెల్లంపల్లి ఎక్స్టెన్షన్ 2లో మిగిలి ఉన్న బొగ్గు నిక్షేపాలను క లుపుకుని కొత్తగా గోలేటి ఓపెన్కాస్టు ప్రారంభించనున్నారు. ఇందులో ముంపునకు గురయ్యే అబ్బాపూర్ గ్రామ నిర్వాసితులకు నర్సాపూర్లో 14 ఎకరాల భూమిలో 85 కుటుంబాలకు సింగరేణి యాజమాన్యం పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు చేస్తున్నది. ఇక మూతపడిన ఎంవీకే 1, 2,3,5,6 భూగర్భ గనులను కలుపుకుని ఎంవీకే ఓపెన్కా స్టు చేయనున్నారు. ఈ గనుల్లో సుమారు 40 మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి స ర్వే సాగుతున్నది. త్వరలోనే పనులు పూర్తి చేసి ఓసీ ప్రారంభించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
మాకు శుభవార్తే..
మూడేళ్లలో పది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు సింగరేణి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సంతోషకరమైన వార్త. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది కార్మికులు స్థానికంగా పనిచేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వహించాల్సి వస్తోంది. మా నాన్న చనిపోవడంతో నేను ఉద్యోగం చేస్తున్నా. అమ్మకు ఆరోగ్యం బాగుండదు. నిత్యం మందమర్రికి వెళ్లి విధులు నిర్వహించాల్సి వస్తోంది. వచ్చీ పోవడానికి ఇబ్బంది అవుతుంది. బెల్లంపల్లి ఏరియాలో రెండు ప్రాజెక్టులు ప్రారంభిస్తారని తెలిసింది. నాలాంటి వారికి ఇది శుభవార్తే. – జడప జగన్, సింగరేణి కార్మికుడు
వ్యాపారం పుంజుకుంటది..
ఇక్కడ ఎనిమిది గనులు ఉండేవి. కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉండేవారు. గనులు మూతపడ్డ తర్వాత ఇక్కడి జనాభా సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు రెండు గనులు ప్రారంభిస్తారని యాజమాన్యం, యూనియన్ నేతలు చెబుతున్నారు. నేను ఇక్కడ కిరాణం నడిపించుకుంటున్న. వ్యాపారం మళ్లీ పుంజుకుంటుంది. ఇందుకు చాలా సంతోషంగా ఉంది.