ఆసిఫాబాద్, సెప్టెంబర్17 : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా మూడో అదనపు న్యాయమూర్తి నారాయణ బాబు అన్నారు. కోర్టు ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన మండల న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా చట్టాలపై, నేరాలు చేయడం ద్వారా ఎలాంటి శిక్షలు ఉంటాయే అవగాహన కల్పిస్తే నేరాలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు సురేశ్, షరీనా, న్యాయవాది ముక్త సురేశ్, తదితరులు పాల్గొన్నారు.
జైనూర్, సెప్టెంబర్ 17: చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని న్యాయవాది జగన్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఐ హనోక్, ఎస్ఐ తిరుపతి, ప్రిన్సిపాల్ శ్రీదేవి, అధ్యాపకులు ఉన్నారు.
సిర్పూర్(టీ), సెప్టెంబర్ 17 : మండలకేంద్రంలోని జూనియర్ కోర్టు ఆవరణలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ కోర్టు జడ్జి బత్తుల రామారావు మాట్లాడుతూ హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు కిశోర్ కుమార్, గణపతి, కల్యాణ్, పారాలీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.
రెబ్బెన, సెప్టెంబర్ 17: మండకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం న్యా య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. రెబ్బెన సీఐ సతీశ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్ఐ భవానీసేన్, న్యాయవాది జుమ్మిడి రాజేశ్, ఆటోడ్రైవర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.