రెండు జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భిణులకు వరం
ఇప్పటివరకు 27 మందికి సుఖప్రసవం
మరో మూడు కేంద్రాల ప్రారంభానికి సర్కారు చర్యలు
ఆదిలాబాద్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో గర్భిణుల సుఖప్రసవం కోసం సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకున్నది. రవాణా పరమైన ఇబ్బందులు ఉన్న 70 గ్రామాలను గుర్తించిన అధికారులు.. ఆయా పల్లెల్లోని గర్భిణుల కోసం బర్త్ వెయిటింగ్ రూమ్స్(జనన నిరీక్షణ గదులు)ను ఏర్పాటు చేశారు. ఉట్నూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) లో యేడాది క్రితం ప్రారంభించగా.. ఇప్పటివరకు 27 మందికి సుఖ ప్రసవం చేశారు. సత్ఫలితాలు ఇస్తుం డడంతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్, ఆదిలాబాద్ జిల్లా లోని నార్నూర్, ఇచ్చోడ మండలాల్లో కూడా వీటిని ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబా ద్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాం తాల్లో గర్భిణులు అవస్థలు పడకుండా వైద్యశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. వానకాలంలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలు రవాణా పరమైన సమస్యలు ఎదురవుతాయి. రెండు జిల్లాల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో రవాణా పరమైన ఇబ్బందులు ఉన్న 70 గ్రామాలను గుర్తించిన అధికారులు.. ఆ యా గ్రామాల్లోని గర్భిణులు సుఖప్రసవాల సమయంలో ఇబ్బందులు పడకుండా బర్త్ వెయిటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఏడాది కిందట ఏర్పాటు చేయగా, మంచి ఫలితాలనిస్తున్నది. 27 మంది గర్భిణులను కేంద్రానికి తీసుకొచ్చి ప్రసవాలు జరిగేలా వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. మంచి ఫలితాలు వస్తుండడంతో మరో మూడు బర్త్ వెయిటింగ్ రూంలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
మరో మూడు కేంద్రాల ప్రారంభానికి చర్యలు
ఎర్లీ రిజిస్ట్రేషన్లో భాగంగా గ్రామాల్లో గర్భిణుల వివరాల కేసీఆర్ కిట్ పోర్టల్లో నమోదు చేస్తారు. వారికి ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబరు కేటాయించి క్ర మంగా అవసరమైన వైద్యసేవలు అందిస్తారు. స్కానింగ్ పరీక్షలు నిర్వహించడంతోపాటు ప్రస వం రోజును కూడా వైద్యులు తెలియజేస్తారు. డెలివరీ రోజుకు కంటే పది రోజుల ముందుగానే 102 అంబులెన్స్లో ఉట్నూర్ బర్త్ వెయింటింగ్ కేంద్రాలకు తీసుకొస్తారు. ఉట్నూర్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు రోజు వీరికి వైద్యం అందిస్తారు. అ వసరమైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్కు తరలిస్తారు. ప్రసవం సమయంలో ఇబ్బందులు లే కుండా రక్తాన్ని కూడా అందుబాటులో ఉంచుతా రు. హిమోగ్లోబిన్ శాతం పెరిగేందుకు డ్రై ఫ్రూట్స్, పండ్లు ఇస్తారు. ఏడాది కిందట ప్రారంభమైన ఉ ట్నూర్ కేంద్రంలో 27 మంది గర్భిణులకు ప్రస వం చేశారు. బర్త్ వెయిటింగ్ కేంద్రాలు మంచి ఫలితాలు ఇస్తుండడంతో కుమ్రం భీం ఆసిఫాబా ద్ జిల్లాలోని జైనూర్, ఆదిలాబాద్ జిల్లాలోని నా ర్నూర్, ఇచ్చోడ మండలాల్లో కూడా వీటిని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.