ఆదిలాబాద్ : ఫేస్ మాస్క్లు ధరించని 177 మందిపై, అదేవిధంగా కొవిడ్ మార్గదర్శకాలను పాటించని 52 మందిపై, అనవసరంగా రోడ్లపైకి వచ్చిన 590 మంది వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్లో శుక్రవారం చోటుచేసుకుంది. లాక్డౌన్ నిబంధనలను అమలు చేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జ్ ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు. పట్టణంలోని ముఖ్యమైన జంక్షన్లలో తనిఖీలు నిర్వహించి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. అనవరంగా రోడ్లపైకి వచ్చేవారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ హర్షవర్ధన్ శ్రీవత్సవ్, అదనపు ఎస్పీలు శ్రీనివాస్ రావు, వినోద్ కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్ రావు, ఉమమహేశ్వర్ రావు, పలువురు ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.