18 ఏళ్ల వయస్సు నిండిన వారంతా టీకా వేసుకోవాలి
జడ్పీచైర్పర్సన్ భాగ్య లక్ష్మి, కలెక్టర్ భారతీ హోళికేరి
మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 16 : కొవిడ్ వ్యాక్సిన్పై అపోహలు వీడి, 18 ఏళ్లు వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, కలెక్టర్ భారతీ హోళికేరి సూచించారు. జిల్లా కేంద్రంలో పాత మంచిర్యాల, రాజీవ్నగర్ యూపీహెచ్సీల పరిధిలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ లెవల్ కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను గురువారం కలెక్టర్ భారతీ హోళికేరి, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి తనిఖీ చేశారు. పట్టణంలో రెండు యూపీహెచ్సీ పరిధిలో 14 కమ్యూనిటీ లెవల్ కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా టీకాలు వేశారు. రాంనగర్, గర్మిళ్ల పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ లెవల్ కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను కలెక్టర్, జడ్పీ చైర్పర్సన్ పరిశీలించారు. వీరి వెంట డీఎంహెచ్వో సుబ్బారాయుడు, జడ్పీ సీఈవో నరేందర్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, కౌన్సిలర్ సత్యం, మెడికల్ ఆఫీసర్ తదితరులున్నారు.
హాజీపూర్ మండలంలో..
హాజీపూర్, సెప్టెంబర్ 16 : హాజీపూర్ మండలంలోని కర్ణమామిడి, దొనబండతో పాటు పీహెచ్సీలో వ్యాక్సినేషన్ సెంటర్ను కలెక్టర్ పరిశీలించారు. గ్రామాలో సర్వేపై పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఎంపీవో రవి బాబు, పీహెచ్సీ డాక్టర్ క్రాంతి కుమార్, కర్ణమామిడి సర్పంచ్ కొట్టె మహేందర్, దొనబండ సర్పంచ్ జాడి సత్యం, ఎంపీపీ స్వర్ణలత, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి తదిప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి
జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ భాగ్యలక్ష్మి తెలిపారు. గురువారం జిల్లా కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా గర్మిళ్లలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. చైర్మన్ వెంట జడ్పీసీఈవో నరేందర్ ఉన్నారు.
లక్షెట్టిపేట మండలంలో..
లక్షెట్టిపేట రూరల్, సెప్టెంబర్ 16: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ప్రతి హెల్త్ సెంటర్లో శానిటైజింగ్ చేసిన తర్వాతే వ్యాక్సినేషన్ను ప్రారంభించాలన్నారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, మున్సిపల్ సిబ్బంది, డాక్టర్లు, సిబ్బంది, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలున్నారు.
కోటపల్లి మండలంలో..
కోటపల్లి, సెప్టెంబర్ 16 : ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని డీఆర్డీవో శేషాద్రి సూచించారు. కోటపల్లి మండలంలోని ఏడు సబ్ సెంటర్ల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ను ఆయన పరిశీలించారు. షట్పల్లిలో ఇంటింటా సర్వేను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంత్రి సురేఖ, ఎంపీడీవో కే భాస్కర్, తహసీల్దార్ గోవింద్ నాయక్, వైద్యాధికారి సత్యనారాయణ, సర్పంచ్లు రాగం రాజక్క, ముల్కల్ల ఉమ, అక్కల మధూకర్, పంచాయతీ కార్యదర్శులు రవళి, సాగర్, హెల్త్ సూపర్ వైజర్ జ్యోతి, ఏఎన్ఎం విజయ, ఉప సర్పంచ్ గోనె మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీకా తీసుకోవాలి..
ఆసిఫాబాద్ టౌన్, (వాంకిడి) సెప్టెంబర్ 16 : 18 సంవత్సరాల వయస్సు నిండిన వారు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. వాంకిడిలోని ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి పర్యవేక్షించారు. వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో బాలింతలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. ఈ