ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
గణేశ్ నిమజ్జనం సందర్భంగా శాంతి కమిటీ సమావేశం
ఎదులాపురం, సెప్టెంబర్ 16 : వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధ్దంగా ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా శాంతియు తంగా జరుపుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నా యక్ సూచించారు. ఈ నెల 19న గణేశ్ నిమజ్జనం పురస్కరించుకొని గురువారం కలెక్టరే ట్ సమావేశ మందిరంలో శాంతి కమిటీ సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన మాదిరిగానే ప్రభుత్వ శాఖల సమన్వయం, ఉత్సవ కమిటీ సహకారంతో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. పండుగలను కొవిడ్ నిబం ధనల మేరకు జరుపుకుంటున్నామని తెలిపారు. పోలీస్ రెవెన్యూ, విద్యుత్, అగ్నిమాపక, మత్స్య శాఖ, రోడ్లు భవనాలు, మున్సిపల్ అబ్కారీ, వైద్య శాఖలు, ఆయా శాఖల పరంగా ఏర్పాట్లు చేప ట్టాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాల అధికా రులను అదేశించారు. ఇన్చార్జి ఎస్పీ రాజేశచంద్ర మాట్లా డుతూ రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగ కుండా సహకరించాలన్నారు. విగ్రహ నిమ జ్జనం సందర్భంగా పెన్ గంగ వద్ద చిన్న పిల్లలు, వృద్ధులను అనుమతించబోమని తెలిపారు. అను మతి లేకుండా డీజేలు ఏర్పాటు చేస్తే సీజ్ చేయ డంతో పాటు కేసులు నమోదు చేస్తామని చెప్పా రు. అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్ మాట్లాడుతూ అధికారులు శాఖల వారీగా విధులను నిర్వర్తించా లన్నారు. అబ్కారీ ఎస్ఐ మాట్లాడుతూ 18వ తేదీ సాయంత్రం నుంచి 20వ తేదీ ఉదయం 11గం టల వరకు బార్లు, వైన్స్ షాపులు మూసి ఉంటా యని తెలిపారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆర్టీవో జాడి రాజేశ్వర్, ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.