ఆదిలాబాద్ రూరల్, జూలై 15: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విద్యానగర్ కౌన్సిలర్ కలాల శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని విద్యానగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గురువారం పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేలా విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫారాలు ఇస్తున్నామన్నారు. నైపుణ్యమున్న ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి తెలుగు, ఇంగ్లీష్, మరాఠీ, ఉర్ధూలో విద్యా బోధన చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు డీ నీలాదేవి, ఉపాధ్యాయులు గిరి, ప్రశాంత్, లక్ష్మీపతి, యూసుఫ్, వెంకటేశ్వర్లు, సీఆర్పీ తేజ పాల్గొన్నారు.
గుడిహత్నూర్, జూలై 15:మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పాఠ్య పుస్తకాలను ఎంఈవో ఆర్ నారాయణ గురువారం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి ఆన్లైన్ తరగతులు వినియోగించుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఆన్లైన్ తరగతుల ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించాలన్నారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల హెచ్ఎంలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎల్ కేశవ్, పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జూలై15 : మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలోని 66 మంది పదో తరగతి విద్యార్థులకు గురువారం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ పోటే శోభాబాయి, జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, సర్పంచ్ కోరెంగా గాంధారి మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆన్లైన్ తరగతులకు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గోపాల్సింగ్ తిలావత్, ఉపాధ్యాయులు ప్రేమ్సింగ్, మాన్సింగ్, సంతోష్, స్వరూపారాణి, సునీత, కవిత, నాయకులు పోటే సాయినాథ్, కోరెంగా సుంకట్రావ్ పాల్గొన్నారు.