నిర్మల్ అర్బన్, అక్టోబర్14 : నిర్మల్ పట్టణంలోని గండిరామన్న దత్త సాయి ఆలయాన్ని రూ.కోటితో అభివృద్ధి చేశామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని దేవరకోట వేంకటేశ్వరస్వామి, గండిరామన్న దత్త సాయి ఆలయాల ప్రాంగణంలో జమ్మి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జమ్మి చెట్టు చాలా పవిత్రమైనదన్నారు. పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ఈ చెట్టుపైనే ఆయుధాలు భద్రపరిచి, తర్వాత యుద్ధంలో గెలిచి విజయం సాధించారని వివరించారు. జిల్లాలోని ప్రతి ఊరిలో జమ్మిమొక్కలు నాటాలని తెలిపారు. అనంతరం చావడి నిర్మాణానికి మంత్రి శంకుప్థాపన చేశారు. అంతకుముందు ఆలయంలో సాయి బాబాకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, సాయి దీక్షా సేవా సమితి అధ్యక్షుడు, ఆలయ కమిటీ చైర్మన్ లక్కాడి జగన్మోహన్రెడ్డి, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్, దేవరకోట ఆలయ చైర్మన్ లక్ష్మీనారాయణ, వ్యాపార వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు మల్లికార్జున్రెడ్డి, గొనుగొప్పుల నర్సయ్య, కౌన్సిలర్లు తదితరులున్నారు.
ప్రయాణికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ప్రయాణికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని బస్ డిపో ప్రాంగంణంలో ఏర్పాటు చేసిన బస్స్టాప్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం డిపో అధికారులు మంత్రిని సన్మానించారు.
జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు..
జిల్లా ప్రజలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా పండుగను జరుపుకుంటామన్నారు. దుర్గామాత ఊరేగింపు, నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
పర్యాటకరంగ అభివృద్ధికి కృషి ..
నిర్మల్ అర్బన్, అక్టోబర్14 : జిల్లాలో పర్యాటకరంగ అభివృద్ధికి కృషి చేస్తానాని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణం చైన్ గేట్ వద్ద నూతంగా ఏర్పాటు చేసిన లైటింగ్ను గురువారం సాయంత్రం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నిమ్మలరాజు పరిపాలనలో గొలుసుల దర్వాజ ప్రధాన ద్వారంగా ఉండేదన్నారు. శ్యామ్ ఘడ్ వద్ద లైటింగ్ను ఏర్పాటు చేయడంతో నిర్మల్కు కొత్త శోభ వచ్చిందన్నారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ మాట్లాడుతూ.. మంత్రి ఆధ్వర్యంలో పట్టణాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతరం మంత్రి తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మీరాంకిషన్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, నాయకులు పాల్గొన్నారు.
బుల్లెట్ బండెక్కి న మంత్రి..
నిర్మల్ అర్బన్, అక్టోబర్14 : నిర్మల్ పట్టణం ఏఎన్రెడ్డి కాలనీలోని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో గురువారం రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి బుల్లెట్ బండిని కొనుగోలు చేశారు. తన మనుమడిని వాహనంపై వెనుక కూర్చోపెట్టుకుని హెల్మెట్ ధరించి రోడ్డు నిబంధనలు పాటిస్తూ ఇంటి వరకు బైక్ రైడ్ చేశారు. అనంతరం ఇంటి వద్ద వాహనపూజ నిర్వహించారు.