డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ n ప్రపంచ రక్తదాతల దినోత్సవ్సం
ఎదులాపురం,జూన్14: రక్తదానం కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్లో సోమవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం నిర్వహించారు. పట్టణంలోని పలువురు యువకులతోపాటు వైద్యారోగ్య సిబ్బంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడారు. జిల్లాలో తలసేమియా, సికిల్సెల్, ఆదివాసుల్లో దాదాపు 60 శాతం మంది గర్భిణులు రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఒక యూనిట్ రక్తంతో నలుగురి ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు. రిమ్స్ బ్లడ్ బ్యాంక్లో శ్రీరాం సేన ఆధ్వర్యంలో 30మంది రక్తదానం చేశారు. సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 22 యూనిట్ల రక్తం సమకూర్చారు. డీఐవో విజయసారథి రక్తదానం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వోలు సాధన, అడిషనల్ డీఎంహెచ్వో శ్రీకాంత్, రెడ్క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ బాల శంకర్ కృష్ణ, శ్రీరాం సేన అధ్యక్షుడు లోఖండే అనిల్, సభ్యులు శశికాంత్, ప్రమోద్, రాకేశ్, అరుణ్, సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఖాజాసిరాజొద్దీన్, లీగల్ అడ్వయిజర్ సర్ఫరాజ్, ఇబ్రహీం, జాయింట్ సెక్రటరీ నవీద్, సమీర్ బేగ్ బ్లడ్బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక
జిల్లా వైద్యారోగ్య శాఖలో ఖాళీలను పారదర్శకంగా భర్తీ చేస్తున్నామని ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ తెలిపారు. సబ్ సెంటర్లలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోస్టులకు రెండో జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలు అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడారు. మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కొత్తగా నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇచ్చోడ, తలమడుగు, బజార్హత్నూర్, ధనూర్ సబ్ సెంటర్ల సీహెచ్వోలను నియమించినట్లు వివరించారు.