ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు
చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి..
ఆదిలాబాద్ రూరల్ / నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 14 : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశ ప్రజలందరికీ ఆదర్శప్రాయుడని, ప్రతి ఒక్కరూ అయన చూపిన మార్గంలో నడువాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని అరణ్యభవన్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా బుధవారం రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే నేడు నిమ్నవర్గాల అభివృద్ధి సాధ్యమవుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే నేడు దేశం నడుస్తున్నదని తెలిపారు. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ సిద్ధించిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆయన సూచించారు.
ఆదిలాబాద్లో ఎమ్మెల్యే జోగు రామన్న..
ఎదులాపురం, ఏప్రిల్ 14 : అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బుధవారం జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయ ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పూలమాలవేసి, పంచశీల జెండాను ఆవిష్కరించారు. అనంతరం బస్టాండ్ ఎదుట నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ చౌక్లోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక కైలాస్నగర్లోని జడ్పీ క్వార్టర్స్ వెనకాల రూ.2 కోట్లతో నిర్మించనున్న అంబేద్కర్ భవన నిర్మాణానికి జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్తో కలిసి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఆర్డీవో జాడి రాజేశ్వర్, అదనపు ఎస్పీ శ్రీనివాస్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు భోజారెడ్డి, డీఎస్సీడీవో భగత్ సునీత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, వివిధ శాఖల అధికారులు, దళిత సంఘం నాయకులు సొగల సుదర్శన్, ప్రజ్ఞాకుమార్, అల్లూరి భూమన్న, నల్ల రాజేశ్వర్, శైలందర్, బాల శంకర్కృష్ణ, పెంటపర్తి ఊశన్న, జి.అశోక్ తదితరులు పాల్గొన్నారు.