నిర్మల్ చైన్గేట్, ఏప్రిల్14: కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నిర్మల్ ప్రధాన దవాఖానతో పాటు ఎంపిక చేసిన కేంద్రాల్లో అధిక సంఖ్య వచ్చి స్వచ్ఛందంగా టీకాలు తీసుకుంటున్నారు.
దవాఖానలో పరీక్షల సంఖ్య పెంచాలి
నిర్మల్ ప్రధాన దవాఖానకు కొవిడ్ పరీక్షల నిమిత్తం ప్రజలు వస్తుండగా పరీక్షల సంఖ్య పెంచాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం అధికసంఖ్యలో ప్రజలు వచ్చా రు. 150 మందికి పరీక్షలు చేశారు. ఇంకా మిగిలి ఉండడంతో దవాఖాన సిబ్బంది మరుసటి రోజు రావాలని సూచించడంతో వచ్చిన ప్రజలు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
దిలావర్పూర్, ఏప్రిల్14 : దిలావర్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం వివిధ గ్రామాల నుంచి వచ్చిన జనంతో కిక్కిరిసింది. ప్రజల్లో అవగాహన పెరుగడంతో కరోనా టీకా వేసుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. టీకా వేసుకునేందుకు ప్రజలు క్యూ కట్టారు. మరో పక్క కరోనా పరీక్షల కోసం కూడా అదే సంఖ్యలో జనం ఆరోగ్యకేంద్రానికి తరలి వచ్చారు.
దస్తురాబాద్, ఏప్రిల్14 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇన్చార్జి డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో బుధవారం 45 సంవత్సరాలు ఉన్న వారికి కొవిడ్ టీకాలను వైద్య సిబ్బంది వేశారు.136 మందికి టీకాలు వేశామని వెల్లడించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి వేణు గోపాల్, స్టాఫ్ నర్సులు, హెల్త్ అసిస్టెంట్ రవి, మధు, రాజేందర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పెంబి, ఏప్రిల్ 14: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మందపల్లి గ్రామం లో బుధవారం 58 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 14 మందికి పాజిటివ్ వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ కిరణ్మయి తెలిపారు. పెంబిలో ఒకరికి, మందపల్లిలో 13 మందికి కరోనా వచ్చిందన్నారు. అలాగే పీహెచ్సీలో 120 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ భూక్యా గోవింద్, వైస్ ఎంపీపీ బైరడ్డి గంగారెడ్డి, ఎంపీవో చిక్యాల రత్నాకర్రావు ఉన్నారు.
ఖానాపూర్ రూరల్, ఏప్రిల్,14 : దిలావర్పూర్ గ్రామంలో పెంబి పీహెచ్సీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా టీకా కేంద్రంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో కదిలి వచ్చారు. బుధవారం ఒకేరోజు కొవిడ్ 19 టీకాల కోసం 193 మంది జనం తరలి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. గ్రామంలో 70 శాతానికి పైగా టీకాలు పూర్తయ్యాయని వైద్యు లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఈవో కన్నయ్య, సాయన్న, నాయకులు మిర్యాల ప్రతాప్ రావ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
కుభీర్, ఏప్రిల్14 : కరోనా నియంత్రణకు ప్రతి వ్యాపారీ తప్ప కుండా వ్యాక్సిన్ వేయించుకుని తమతో సహకరించాలని మేజర్ జీపీ సిబ్బంది బీ ప్రకాశ్ సూచించారు. సర్పంచ్ పానాజీ మీర ఆదేశాల మేరకు బుధవారం కుభీర్లోని అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థ య జమానుల వివరాలను నమోదు చేసుకున్నారు. వ్యాపార యజమా నులు ఫోన్ చేసిన వెంటనే పీహెచ్సీకి వెళ్లి టీకా వేయించుకోవాలని లేని పక్షంలో చర్యలు తప్పవని సూచించారు. వ్యాక్సిన్కు అర్హులైన వారి జాబితాను రూపొందిస్తున్నారు.
ఖానాపూర్ రూరల్,ఏప్రిల్,14: పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో బుధవారం కొవిడ్ 19 పరిక్షల నిర్ధారణ కోసం వచ్చిన జనం బారులు తీరారు. ఒకే రోజు 136 పరీక్షలు నిర్వహించగా 37 మందికి పాజిటివ్ కేసులు నమోదైయినట్లు వైద్యులు వెల్లడించారు.