ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 14: పట్టణంలోని చిరువ్యాపారం నిర్వహించే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని లేకుంటే జరిమానా తప్పదని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని హోటళ్లు, వైన్స్, మెడికల్, ఫాస్ట్ఫుడ్, చికెన్ సెంట ర్ల వ్యాపారులకు రూ.500చొప్పున జరిమానా విధిస్తూ సూచనలు చేశారు.
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 14: మండల కేంద్రంలో ఎస్ఐ నాగ్నాథ్ వాహనాలతో పాటు దుకాణాలు తనిఖీ చేశారు. మాస్కు లేని వారిని గుర్తించి రూ.1000 జరిమానా విధించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది నాగోరావ్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.
కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ సీఐ గంగాధర్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని సాత్నానల వద్ద ఆటో డ్రైవర్లకు కొవిడ్, నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్కులు లేకుండా ప్రయాణించవద్దన్నారు. ఆట్లో డ్రైవర్లకు మాస్కులు, కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ అబ్దుల్బాకి, రామారావు, సిబ్బంది పాల్గొన్నారు.
నార్నూర్, ఏప్రిల్ 14: ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని లేకుంటే రూ.1000 జరిమానా విధిస్తామని ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ అన్నారు. బుధవారం గాదిగూడ మండలం మారేగావ్ గ్రామ సమీపంలో ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ బుధవారం వాహనాలు తనిఖీ చేశారు. ఆటో డ్రైవర్లు, ప్రయాణికులకు మాస్కులు ధరించాలని అవగాహన కల్పించారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది జగదీశ్, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.