సీసీసీ నస్పూర్, అక్టోబర్ 13 : శ్రీరాంపూర్ సీహెచ్పీ నుంచి రోజుకు 5 ర్యాకుల బొగ్గు రవాణా సామర్థ్యం పెరుగుతుందని సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన సీహెచ్పీలో పర్యటించారు. అధికారులు, యూనియన్ నాయకులు డైరెక్టర్కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సత్యనారాయణ, ఏరియా జీఎం సురేశ్, డీవైజీఎం డీవీ రావు, ఈఈ కుమార్తో కలిసి సీహెచ్పీలోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వీరిని టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి శ్రీనివాసాచారి, సహాయ కార్యదర్శి అర్కాల శ్రీనివాస్, నర్సయ్య శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. సీహెచ్పీలో ప్రస్తుతం రోజుకు 2, 3 ర్యాకులతో 20వేల టన్నుల బొగ్గు రవాణా చేస్తున్నామన్నారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న సీహెచ్పీ డిసెంబర్ చివరికల్లా పూర్తి అవుతుందని, దీంతో రోజుకు 5 ర్యాకుల బొగ్గు రవాణా చేస్తామని పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఏరియా బొగ్గు ఉత్పత్తి, రవాణాలో ముందంజలో ఉందని, ఇందుకోసం కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్రెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి చాట్ల అశోక్, ఎస్వోటూ జీఎం గుప్తా, డీజీఎంలు గోవిందరాజు, చిరంజీవులు, విజయభాస్కర్రెడ్డి, ఏవీ రెడ్డి, ఎస్ఈ బసవరాజు, ఈఈలు సదయ్య, దామోదర్, మోహన్, రవి, సంపత్, నర్సయ్య పాల్గొన్నారు.