ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
జిల్లాకేంద్రంలో జయంతి వేడుకలు
ఎదులాపురం, జూన్13 : దేశానికి మహారాణా ప్ర తాప్సింగ్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నా రు. జిల్లాకేంద్రంలో బస్టాండ్ వద్ద బొందిలి రాజ్పుత్ సమాజ్ ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ సింగ్ 481వ జయంతి వేడుకలను ఆదివారం ఘ నంగా నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టుప్రహ్లాద్, రైతు బం ధు సమితి మండలాధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, వా ర్డు కౌన్సిలర్ వెనగంటి ప్రకాశ్, నాయకులు దుర్గం శేఖర్, రాజ్పుత్ సమాజ్ అధ్యక్షుడు స్వదీప్సింగ్ఠాకూర్, సభ్యులు రాజేందర్ సింగ్, జగదీశ్సిం గ్, విజయాసింగ్శేఖావత్, సందీప్ పాల్గొన్నారు.
ఆరోగ్య శ్రీ సేవలను వినియోగించుకోవాలి
ఆరోగ్య శ్రీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నా రు. జిల్లాకేంద్రంలోని తాంసి బస్టాండ్ వద్దనున్న క్రోమ్ దవాఖానలో ఆరోగ్య శ్రీ ఆర్థోపెడిక్ సేవలను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ (ఆరోగ్యశ్రీ) డాక్టర్ జీ సాయికృష్ణతో కలిసి వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో మొదటిసారిగా ప్రైవేట్ దవాఖానలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇకనుంచి జిల్లా ప్రజలు నిజామాబాద్, హైదరాబాద్కు వెళ్లకుండా ఇక్కడే ఆర్థోపెడిక్ సేవలు, రూ.2 లక్షల వరకు శస్త్రచికిత్సలు ఉచితంగా చేసుకునే అవకా శం ఉంటుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్నకు వైద్యులు జ్ఞాపికను అందజేసి శాలువాతో సత్కరించారు. వైద్యులు, జీ ప్రకాశ్, జీ హే మలత, హిమాని, మార్కెట్ కమి టీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, టీఆర్ఎస్ నాయకులు యున్సిస్ అక్బనీ, దుర్గం శేఖర్, డీఐవో విజయసారథి, వార్డు కౌన్సిలర్లు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.