రామవరం, అక్టోబర్ 10 : కొత్తగూడెం ఏరియా కిస్టారం ఓసీ మెరిట్ టెక్నాలజీస్ను సుమారు రూ.12 కోట్లతో గంటకు వెయ్యి నుంచి 1500 టన్నుల బొగ్గును లోడింగ్ చేయగల కెపాసిటీతో ఏర్పాటు చేసిన నూతన ట్రక్ ప్రీ వేబిన్ సిస్టంను ఆదివారం సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్, సత్యనారాయణ ప్రారంభించారు. ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం నరసింహారావుతో కలిసి డైరెక్టర్లు మొక్కలు నాటి హరితహారాన్ని ప్రారంభించారు. డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కిస్టారం ఓసీలోని ఈ నూతన ట్రక్ ప్రీ వేబిన్ను ప్రారంభించడం ద్వారా బొగ్గు తూకంలో హెచ్చుతగ్గులు లేకుండా రవాణా కూడా వేగం అవుతుందని అన్నారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలుగకుండా డస్ట్ రాకుండా అధునాతన టెక్నాలజీతో ఈ ప్రీ వేబిన్ ఏర్పాటు చేశామని, ఈ ట్రక్ ప్రీ వేబిన్ నిర్ణీత సమయంలో ఏర్పాటుకు కృషి చేసిన కొత్తగూడెం ఏరియా జీఎం నరసింహారావు, జీఎం సీహెచ్పీ స్వామి నాయుడు, మెరిట్ టెక్నాలజీస్, సంబంధిత ఉన్నతాధికారులను అభినందించారు. అనంతరం డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. బొగ్గు తూకంలో హెచ్చతగ్గులు లేకుండా కచ్చితంగా ఉండడానికి అన్ని ఏరియాల్లో ప్రీ వేబిన్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఇక్కడ డీజీఎంఎస్ రూల్స్ ప్రకారం ఆపరేటర్ క్యాబిన్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. పర్యావరణ హితంగా, డస్ట్ రాకుండా, వాటర్ స్ప్రేయర్లతో ఈ ట్రక్ ప్రీ వేబిన్ను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎస్వోటూ డైరెక్టర్ ఆపరేషన్స్ దేవీకుమార్, జీఎం ఈఅండ్ఎం సీహెచ్పీలు స్వామి నాయుడు, సీఎంవోఏఐ జాయింట్ సెక్రటరీ రమేశ్, ఇన్చార్జి ఎస్వోటూ జీఎం రమేశ్, ఏరియా ఇంజినీర్ రఘురామిరెడ్డి, పీవోలు వీసం కృష్ణయ్య, వెంకటాచారి, స్ట్రక్చర్డ్ కమిటీ మెంబర్ చెన్న కేశవరావు, డీజీఎంలు సూర్యనారాయణ, ఉజ్వల్ కుమార్ బెహ్రా, కిస్టారం ఓసీ మేనేజర్ మురళి, ప్రాజెక్టు ఇంజినీర్లు రామకృష్ణ, లక్ష్మణ్ మూర్తి, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ రమణారెడ్డి, జేఎంవో కొండేశ్వర్రావు, కిస్టారం ఓసీ రక్షణ అధికారి గోపీ కిశోర్, సీనియర్ పీవోలు సంతోష్, సందీప్, సుధాకర్, పిట్ సెక్రటరీ జీ శ్రీనివాస్, ఇతర అధికారులు, మెరిట్ టెక్నాలజీ సిబ్బంది, సేవా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.