ఇంజినీరింగ్, బీఎడ్, వెటర్నరీ కళాశాలలు ఏర్పాటు చేయండి..
జైనథ్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల నెలకొల్పండి..
సీఎం కేసీఆర్కు విన్నవించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
చనాకా-కొరటా పంప్హౌస్కు రూ.15 కోట్లు మంజూరు : రామన్న కృతజ్ఞతలు
ఆదిలాబాద్ రూరల్, మే 10 : ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం జొన్న దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉందని, ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఆదేశాలివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న విజ్ఞ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను వివరించారు. జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల, ప్రభుత్వ బీఎడ్ కళాశాల, వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల, జైనథ్ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. చనాకా – కొరాట పంప్ హౌస్కు సంబంధించి రూ.15 కోట్లు కావా లని విన్నవించారు. సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావును పిలిచి నిధులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. మిగిలిన సమస్యలపై కూడా త్వరలోనే నిధులు మం జూరు చేస్తానని సీఎం హామీ ఇచ్చారని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు.